సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ
మల్హర్, సెప్టెంబర్ 12(చక్రవాణి న్యూస్) :మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన ఇందారపు రాజేశ్వరి–రవీందర్ దంపతుల కుమారుడు ఇందారపు దావిద్ రాజు ఐఏఆర్ఈ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ విభాగంలో బీటెక్ పూర్తి చేసి పట్టా అందుకున్న సందర్భంగా శనివారం తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు ఇందారపు చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కేసరసారపు చంద్రయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు కేసారపు నరేష్, ఇందారపు ప్రభాకర్, నారమళ్ల ఎర్ర పోచయ్య తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment