Full width home advertisement

Post Page Advertisement [Top]


 విద్యుత్ వినియోగం, మోటర్ల నిర్వహణపై ప్రభుత్వం వాస్తవ లెక్కలు వెల్లడించాలని డిమాండ్

హైదరబాద్ సెప్టెంబర్ 12(చక్రవాణి న్యూస్) : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని పంప్‌హౌస్‌ల నిర్వహణపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నంది, గాయత్రి పంప్‌హౌస్‌లలో భారీ మోటర్లను ఏ విధంగా నడుపుతున్నారు? రైతులకు అవసరమైన స్థాయిలో నీటిని ఎత్తిపోస్తున్నారా? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.మోటర్లను తరచూ ఆన్, ఆఫ్ చేయడం వల్ల వాటి పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. మోటర్ల రన్ అవర్స్, విద్యుత్ వినియోగం, నిర్వహణ ఖర్చులు, మరమ్మతుల వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణపై మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేత కేటీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.గాయత్రి పంప్‌హౌస్ నుంచి నీటి ఎత్తిపోతలపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మోటర్ల నిర్వహణకు సంబంధించిన అధికారిక రికార్డులను బయటపెట్టాలని కోరారు.అయితే బీఆర్ఎస్ ఆరోపణలపై ప్రభుత్వం, నీటిపారుదల శాఖ నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. సంబంధిత రికార్డులు వెలుగులోకి వస్తే వాస్తవ పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

చక్రవాణి
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...

అన్యాయాన్ని అంతం చేసే

విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]