Full width home advertisement

Post Page Advertisement [Top]

దుబ్బపేట, అడ్వాలపల్లి, పెద్దతూండ్ల గ్రామ శాఖలకు కొత్త అధ్యక్షుల నియామకం 

 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నిక

మల్హర్ , ఆగస్టు 31 (చక్రవాణి న్యూస్) :
మల్హర్‌ మండలంలోని మూడు గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు జంగిడి శ్రీనివాస్ తెలిపారు. దుబ్బపేట గ్రామ శాఖ అధ్యక్షుడిగా అజ్మీర సతీష్‌ నాయక్, అడ్వాలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా అజ్మీర రాజు, పెద్దతుండ్ల గ్రామ శాఖ అధ్యక్షుడిగా పెద్దతూండ్ల ఉప సర్పంచ్ తాళ్ల రవీందర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇప్ప మొండయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బడితెల రాజయ్య, మాజీ ఎంపీపీ మలహల్‌ రావు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలు, కొయ్యూరు సర్పంచ్‌ కొండ రాజమ్మ, సర్పంచ్‌ బండారి నరసింగరావు, మండల రాహుల్, మాజీ సర్పంచ్‌ రాజు నాయక్ తదితర కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.




ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]