ఓటర్ల జాబితా సవరణ కు గడువు పొడిగింపు

 *GOOD NEWS:  


గుడ్ న్యూస్ 

సెప్టెంబర్‌ 8(చక్రవాణి న్యూస్) :

 తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్‌, అభ్యంతరాలను దాఖలు చేసేందుకు ఉన్న గడువును పొడిగించింది. ముందుగా సెప్టెంబర్‌ 16 వరకు ఉన్న గడువును అక్టోబర్‌ 7 వరకు పొడిగించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.


ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నా, మార్పులు అవసరమైనా ఈ గడువులోగా క్లెయిమ్స్‌, అభ్యంతరాలు సమర్పించుకోవచ్చు. గడువు ముగిసిన అనంతరం అందిన క్లెయిమ్స్‌, అభ్యంతరాలను అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించనున్నారు.


*నవంబర్‌ 5వ తేదీలోగా పరిష్కారం*


క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణ పూర్తయిన తర్వాత వాటి పరిశీలన, పరిష్కార ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని నవంబర్‌ 5లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అధికారులు దాఖలైన అభ్యంతరాలను పరిశీలించి అర్హత, వివరాల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోనున్నారు.


*నవంబర్‌ 9న తుది జాబితా*


క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం పూర్తైన అనంతరం తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను నవంబర్‌ 9న ప్రకటించనున్నారు. దీంతో SIR ప్రక్రియలో కీలకమైన తుది దశ పూర్తి కానుంది.


*ముఖ్యమైన తేదీలు:*


*అక్టోబర్‌ 7:* క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ

*నవంబర్‌ 5:* క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం పూర్తి

*నవంబర్‌ 9:* తుది ఓటర్ల జాబితా ప్రకటన

Post a Comment

0 Comments