పేలుడు ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు
భూపాలపల్లి, ఆగస్టు 22(చక్రవాణి న్యూస్) :
కూలి పనికి వెళ్లిన మహిళకు చేనులో ఊహించని ప్రమాదం ఎదురైంది. మిరప చేనులో పనులు చేస్తుండగా భూమిలో ఉన్న అనుమానాస్పద వస్తువు ఒక్కసారిగా పేలడంతో మహిళా కూలీ గాయపడింది.
భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పేలిన వస్తువు ఏ రకానికి చెందినది, చేనులోకి ఎలా చేరిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.


0 Comments