జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలం, గాంధీనగర్ కూడలి హైవే పైన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని ట్రాక్టర్ తో తొక్కించడాన్ని 'టి ఆర్ మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక సంస్థ' (TR Human Rights & Anti Corruption Association) జిల్లా చైర్మన్ మంత్రి రాజబాపు తీవ్రంగా ఖండించారు. గురువారం భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి రాజబాపు మాట్లాడుతూ.. ఘనపూర్ మండలం, గాంధీనగర్ కూడలిలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆ స్థలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ప్రజలందరూ కలిసి ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ప్రపంచ ప్రజ్ఞాశీలి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశంలోని ప్రజలందరికీ మానవ హక్కులు కల్పించిన అతిరథ మహావీరుడు, భారతదేశంలోని 90% జనాభాకు ఆరాధ్య దైవమైన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి చిత్రపటాన్ని ట్రాక్టర్ తో తొక్కించడం అత్యంత ఘోరమైన విషయమన్నారు.ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తి పై తక్షణమే చర్యలు తీసుకుని ఈ సంఘటన పై పూర్తి స్థాయి విచారణ జరిపి సంఘటన వెనుక ఉన్న దోషుల పై కేసులు నమోదు చేసి శిక్షించాలని కోరారు. వారి వెంట హ్యూమన్ రైట్స్ సభ్యులు ఉన్నారు.
తాడిచెర్ల ప్రజలకు గుడ్ న్యూస్.. సింగరేణికి 'తాడిచెర్ల-2' కోల్ బ్లాక్ కేటాయింపు!
రాబోయే 40 నుండి 50 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తి స్థానికంగా పెరగనున్న ఉపాధి అవకాశాలు!" మల్హర్. జూలై 7 (చక్రవాణి న్యూస్) : భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచెర్ల పరిధిలోని 'తాడిచెర్ల-2' కోల్ బ్లాక్ను సింగరేణి (SCCL) సంస్థకే కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ కేటాయింపు ఫైలుపై అధికారికంగా సంతకం చేశారు.ఈ నిర్ణయం ద్వారా తాడిచెర్ల ప్రాంతంలో రాబోయే 40 నుండి 50 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి జరగనుంది. తద్వారా స్థానిక ప్రాంత అభివృద్ధికి, సింగరేణి కార్మికుల భవిష్యత్తుకు భారీ లబ్ధి చేకూరనుంది. ఒడిశాలోని 'నైనీ' కోల్ బ్లాక్ అనుమతులతో పాటు మన తాడిచెర్ల బ్లాక్ కూడా సింగరేణి పరం కావడం పట్ల స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా పక్షం - అవినీతిపై సమరం "చీకటిని చీల్చే సూర్యకిరణం... అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్! " ...

0 Comments